ఉయ్యాలవాడ నారసింహారెడ్డి తిరుగుబాటు కాలక్రమణిక

బండిగోపాలరెడ్డి(బంగోరే)వ్యాసం ఆధారంగా

1846 జూలై 6:
మజ్జారి నరసింహారెడ్డి అనే పించను దారుడైన పాళయగారు కొందరు కొండవాళ్ళను, కట్టుబడి బంట్రోతులను పోగు చేసుకొని, ఆయుధాలు సమకూర్చుకొని ప్రభుత్వాన్ని ధిక్కరించడానికి  ఆయత్తమవుతున్నాడని కోయిలకుంట్ల తాసీల్దార్ వగైరా తాలూకా అధికార్లకు తెలిసి బంట్రోతుల్ని పెట్టి బందోబస్తుగా పంపిస్తే ఆయన సరిగా సమాధానం చెప్పక తిరగబడి బెదరగొట్టి పంపించినట్లు కోయిలకుంట్ల హెడ్ పోలిస్ తనకు వర్తమానం పంపాడనీ అందువల్ల నారసింహారెడ్డిని అతని మనుషుల్ని వొక కంట కనిపెడుతూ వుండవలసినదిగా కోరుతూ కర్నూలు లోని [...]