Doubts from Maidanam

by admin@ 24fps

లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో వుంటుంది. ఇదివరకంతా యీ మనుషుల్లోంచి, నీతి వర్తనుల లోంచి వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడంవల్ల నేను చేసినపని ఘోరత్వం, నీచత్వం బోధ్పడలేదు. ఆ జీవితమంతా సుందరమైన స్వప్నం వలె, ఆ ఎదారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళ హారతివలె తోచింది. ఇంటినే, మంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్నీ, మీరానీ అనుభవించిన తరువాత, మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా మనుష్యులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగై,

“లేచిపోయిందట్రా!”
“చాలా బావుందిరా మనిషి!”
“కావాలసిందే శాస్తి ముండకి!”

అంటూ వుంటే అర్థమయింది నాకు లోకమార్గం. చివరికి నువ్వు అన్నావు- ‘లేచిపోవడానికి నీ భర్త లోపమేమన్నా వుందా?” అని. ఆయన్నెరుగుదువా? అమీరే నాకు కనబడకపోతే ఇంకా నా పెనిమిటితో కాపరం సుఖంగా, మత్తుగా చేస్తోవుండేదాన్నే. అమీర్ తో నీకో ఇంకో పతివ్రతకో స్నేహమే వుంటే, మీరూ లేచిపోయివుందురు. అతని ఆకర్షణ నిగ్రహించలేక మీరూ, నేనూ కాదు జవాబుదారీ దానికి. ఒప్పుకోవూ? మీరెవరూ లేచిపోయి వుండరూ?

నీ మాట నిజమేమో? ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం వుండాలికదా! కాని మధ్యాహ్నపు సోమరి గాలి నన్ను తాకితే ఒళ్ళు ఝల్లుమనే నాకు, అమీరు విశాల వక్షపు వొత్తిడి స్వర్గంగా అర్థం కాకుండా వుండాగలదా? పోనీండి. మీరే అదృష్టవంతులేమో తగాదా యెందుకు?  

ఇదంతా మైదానం మొదటి పేజీనుంచని చెప్పనవసరం లేదనుకుంటా!

చాలా రోజుల తర్వాత చలం మైదానం చదువుదామని రాత్రి పుస్తకం తీసాను. అదేంటో గానీ మొదటి పేజీ దాటలేకపోయాను.
అందుకు కారణాలు చాలా వున్నాయి. గతంలో ఒక స్నేహితుడితో మైదానం గురించి ఒక స్నేహితునితో చర్చిస్తున్నప్పుడు, “ఆ ఏముందయ్యా మైదానంలో, తన వాంచలు తీర్చుకోడానికి బరితెగించి ఒకరు కాదు ఇద్దరితో పడుకున్న ఒక స్త్రీ కథే గా! ఎందుకా పుస్తకానికి అంత ప్రాముఖ్యత ఇస్తారో!” అని నా స్నేహితుడన్నప్పుడు నాకు అతనికి చెప్పదానికి సరైన సమాధానం దొరకలేదు. ఎప్పుడోకప్పుడు మైదానం మళ్ళీ చదివి సరిగ్గా అర్థం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఈ పుస్తకంపై phd చేసిన వాళ్ళను అడిగి తెలుసుకుందామని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలేవీ ఫలితాలివ్వలేదు.

సరే నేనే సీరియస్ గా చదివి అర్థం చేసుకుందామనే ప్రయత్నంలో నిన్న రాత్రి పుస్తకం పట్టుకుని మొదటీ పేజీ దాటి రేండో పేజీలో అడుగుపెట్టే లోపే బోల్డన్ని అనుమానాలు. నా అనుమానాలు/ప్రశనలకు మీరెవరన్న సమధానాలివ్వగలరెమో ప్రయత్నించండి.

1)”చివరికి నువ్వు అన్నావు -లేచిపోవడానికి నీభర్తలోపమేమన్న వుందా?” అన్న వాక్యంలో ఆ నువ్వు” ఎవ్వరు? ఒకవేళ ఆ “నువ్వు” చలం అనుకుందామనుకుంటే “అమీర్ తో నీకో ఇంకో పతివ్రతకో స్నేహమే వుంటే, మీరూ లేచిపోయివుందురు.” అన్న వాకయం ద్వార ఆ “నువ్వు” ఒక స్త్రీ అన్న విషయం అర్థమవుతుంది. అంటే ఆ “నువ్వు” పాఠకురాలని అర్థమా?

2)”…..వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడంవల్ల నేను చేసినపని ఘోరత్వం, నీచత్వం బోధపడలేదు” అని రాజేశ్వరి అన్నప్పుడు, “మీరే అదృష్టవంతులేమో తగాదా ఎందుకు?” అని తన దురదృష్టాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆమె చేసినది తప్పు ఒప్పుకున్నట్టా?

3)”జీవితం సుందరమైన స్వప్నం వలె, ఆ ఎడారి పుణ్యభూమివలె……” అని తన గతాన్ని నెమరు వేసుకున్నప్పుడు, “ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం వుండాలికదా…” అని చెప్పినప్పుడు  తన చేసిన పనిలో తప్పేమీలేదని రాజేశ్వరి చెప్తున్నట్టా?

పై ప్రశ్నల్కు మీకు తోచిన సమాధానాలు ఇవ్వగలరని మనవి.